
వ్యభిచార రొంపిలో దింపేందుకు మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు కేటుగాళ్లు. అంతే కాకుండా మైనర్ బాలికకు గంజాయి తాగించి అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. మార్చి 11న జరిగిన ఈ పాశవిక ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మార్చి 11వ తేదీ వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కి సంబంధించి ఫిర్యాదు రాగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు కిడ్నాప్ కు గురైన మైనర్ బాలికని ములుగు క్రాస్ దగ్గర గుర్తించారు.తదుపరి బాలికని విచారించగా తనని కొంతమంది కిడ్నాప్ చేసి గంజాయి త్రాగించి తనపైన అత్యాచారం చేసారని తెలిపింది బాలిక.బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందుతుల కోసం గాలించారు.ఈ క్రమంలో దామెర మండలానికి చెందిన పడుపు వృత్తి చేసే మస్కు లతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
లతతో పాటు తన దగ్గర ఉన్న మరో మైనర్ నిందితురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మైనర్ నిందితురాలు సాయంతో లత బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. బాధిత బాలికతో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తెలిపింది. ఈ కిడ్నాప్ ప్లాన్ లో మైనర్ నిందితురాలి లవర్ హస్తం కూడా ఉందని గుర్తించారు పోలీసులు. మైనర్ నిందితురాలు లవర్ అబ్దుల్ అప్నాన్ సాయంతో మైనర్ బాలికకు మందు గంజాయి అలవాటు చేసి తమ ట్రాప్ లో పడేలా చేశారని తెలిపారు పోలీసులు.
Also Read :- హైకోర్టునే తప్పుదోవ పట్టించినందుకు కోటి రూపాయల ఫైన్ విధించిన జడ్జి
ఈ క్రమంలో అబ్దుల్ అప్నాన్ తనకు మందు, గంజాయి తాగించి.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది బాలిక. అత్యాచారం చేసే సమయంలో వీడియో రికార్డ్ చేసారని..ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే.. వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు తెలిపింది బాలిక. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు అబ్దుల్ అప్నాన్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదిలా ఉండగా.. ప్రధాన నిందుతురాలు ముస్కు లత ఇంటి వద్ద 4300 కండోమ్ పాకెట్స్ తో పాటు రూ. 7వేల 500 నగదు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. అంతే కాకుండా ఒక బ్రేజా కారు, 4 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.