నల్లబెల్లి, వెలుగు: నల్లబెల్లి పోలీస్ స్టేషన్ను గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ సాయిలు మరో ముగ్గురులో కానిస్టేబుల్స్ ఉండటంతో మిగత వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల పనితీరు, కేసుల నమోదు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల వివరాలను ఆరా తీశారు. ఉన్న ప్రతి పోలీస్నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు. నైట్ పెట్రోలింగ్ చేస్తూ, సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.