పోలీసులు నిజాయితీగా పని చేయాలి

పోలీసులు నిజాయితీగా పని చేయాలి

హనుమకొండ/ శాయంపేట(ఆత్మకూర్)​, వెలుగు: డిపార్ట్​మెంట్​మర్యాదలు పెంపొందించేలా పోలీస్​ ఆఫీసర్లు పని చేయాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. కమిషనరేట్​పరిధిలోని దామెర, ఆత్మకూర్​పోలీస్​ స్టేషన్లతోపాటు కంఠాత్మకూర్​ చెక్​పోస్ట్ ను మంగళవారం ఆయన సందర్శించారు. స్టేషన్​లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, రికార్డు గదులను పరిశీలించి, ఆయా స్టేషన్ల పరిధిలో జరిగే నేరాలపై ఆరా తీశారు.

 స్టేషన్​ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, రోజు ప్రమాదాల సంఖ్య, సిబ్బంది తదితర వివరాలు సేకరించారు.  ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పని చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయనవెంట ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌, ఏసీపీ సతీశ్​బాబు తదితరులున్నారు.