
హనుమకొండసిటీ/ మహబూబాబాద్, వెలుగు: విస్తృత స్థాయిలో మత్తు పదార్థాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రివార్డులు అందుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీన్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాలను పట్టుకోవడం శ్రమించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్ స్పెక్టర్లు కరుణాకర్, సుధాకర్ రెడ్డి, సార్ల రాజు, శ్రీధర్ ను డీజీపీ డా.జితేందర్ రివార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న అధికారులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్కూడా ఈ అవార్డును
అందుకున్నారు.