పంచాయతీ ఓటర్​ లిస్ట్​ విడుదల

పంచాయతీ ఓటర్​ లిస్ట్​ విడుదల

కామారెడ్డి, వెలుగు:  గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల లిస్ట్​ను స్టేట్​ఎలక్షన్​ కమిషన్​ ఆదేశాలతో  ఆఫీసర్లు శుక్రవారం రిలీజ్​ చేశారు. కామారెడ్డి జిల్లాలోని మొత్తం 535 గ్రామ పంచాయతీల్లో  6,36,300  మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో  మహిళలు 3,29,747 మంది, పురుషులు 3,06,538 మంది,  ఇతరులు 15 మంది ఉన్నారు.   పంచాయతీ , ఎంపీడీవో,  కలెక్టరేట్​ ఆఫీసు నోటీసు బోర్డుల్లో లిస్ట్​ ఉంచారు.  ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రచురించిన  అసెంబ్లీ నియోజక వర్గాల పోలింగ్​ కేంద్రాల ఓటర్ లిస్ట్​ను ప్రామాణికంగా తీసుకొని  పంచాయతీ ఓటర్ల లిస్ట్​ను తయారు చేశారు.  

వార్డుల వారీగా ప్రకటించిన లిస్ట్​లో ఏమైనా అభ్యంతరాలు  ఉంటే  ఈ నెల 14 నుంచి 18 వరకు పంచాయతీ సెక్రటరీలకు తెలియజేయాలని జిల్లా పంచాయతీ ఆఫీసర్​ శ్రీనివాస్​రావు  తెలిపారు. 19న మండల స్థాయిలో పొలిటికల్​పార్టీల ప్రతినిధులతో మీటింగ్​ ఉంటుందన్నారు.  అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత ఈనెల 28న ఫైనల్​లిస్ట్​ప్రకటిస్తామన్నారు.