కరెంట్ షాక్​తో వాచ్ మన్ మృతి

కరెంట్ షాక్​తో వాచ్ మన్ మృతి

మియాపూర్, వెలుగు: కరెంట్​షాక్​తో వాచ్ మన్  మృతి చెందాడు. మియాపూర్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఉపేంద్ర(32) భార్య, ఇద్దరు పిల్లలతో మియాపూర్ మాధవ్​నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో ఉంటూ వాచ్​మన్​గా చేస్తున్నాడు. బుధవారం ఉదయం అపార్ట్​మెంట్​లో నీటి కోసం మోటార్​ఆన్​చేయగా కరెంట్ షాక్​కొట్టింది.  కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేశామని మియాపూర్​ పోలీసులు తెలిపారు.