
- మృతుడు బిహార్ వాకు చెందిన హరిరామ్ సింగ్
- కొంపల్లి మై స్పేస్ ఆరా కన్స్ట్రక్షన్ వద్ద ఘటన
జీడిమెట్ల, వెలుగు: నిద్రపోయిన వాచ్ మెన్ పైకి రెడిమిక్స్ వెహికల్ ఎక్కడంతో మృతిచెందాడు. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్కి చెందిన హరిరామ్సింగ్యాదవ్(40) బతుకు దెరువుకు ఐదు రోజుల కిందట సిటీకి వచ్చి కొంపల్లిలోని మై స్పేస్ ఆరా కన్స్ట్రక్షన్లో వాచ్మెన్గా చేరాడు. మంగళవారం రాత్రి నిర్మాణం వద్దకు రెడిమిక్స్ కాంక్రీట్వెహికల్ వచ్చి ఆగింది. దాని వెనకాలహరిరామ్సింగ్నిద్రపోయాడు. డ్రైవర్ చూసుకోకుండా వెహికల్ ను వెనక్కి తీయడంతో టైర్లు ఎక్కడంతో అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.