
- నీటి వృథా, అక్రమ కనెక్షన్లపై ఫోకస్
- త్వరలో అందుబాటులోకి సేవ్ వాటర్’ యాప్
- స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని పిలుపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో నీటి వృథాతో పాటు అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి సమాచారం ఇవ్వండంటూ వాటర్బోర్డు జనాలకు ఓ ఆఫర్ప్రకటించింది. దీని కోసం ‘సేవ్ వాటర్’ యాప్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ యాప్నుంచే ఫిర్యాదులు చేయాలని సూచిస్తోంది. దీనికి సంబంధించి సాంకేతిక పరమైన అంశాలను పరిశీలిస్తున్నారు.
వాటర్బోర్డు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి ఎంతో దూరం నుంచి నీటిని తీసుకువస్తుండగా చాలామంది వృథా చేస్తున్నారు. కొందరు వాహనాలు కడుక్కోవడానికి, మరికొందరు ఇంటి ముందు, పైన చల్లగా ఉంటుందని వృథా చేస్తున్నారు. మెజారిటీ కనెక్షన్దారులైతే నల్లాలకు మీటర్లు పెట్టి గుంజుకుపోతున్నారు. దీనికి చెక్పెట్టేందుకు కొత్త ఆలోచన చేసింది.
నీటి వృథా, అక్రమ కనెక్షన్లపై ప్రజలే నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చే విధంగా ‘సేవ్ వాటర్’ యాప్ ను రూపొందించింది. ఎవరైనా ఈ యాప్డౌన్లోడ్ చేసుకుని వారి ఫోన్ కెమెరాతో ఫొటోలు తీసి షేర్ చేస్తే సరిపోతుంది. మిగిలిన పని అధికారులు చూసుకుంటారు.
అలాగే సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. 1.40 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ లో 13.80లక్షల కనెక్షన్దారులు ఉండగా..ప్రతి రోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించేందుకు చాలా టైం పడుతోంది. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సేవ్ వాటర్యాప్ను తీసుకువచ్చి నీటి వృథాను అరికట్టే ప్లాన్చేసింది.
వలంటీర్లుగా పని చేయండి..
నీటి వృథాపై వాటర్బోర్డుకు సమాచారం ఇవ్వడానికి కనీసం ఐదు వేల మంది వలంటీర్లుగా వస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు అనుకుంటున్నారు. ప్రజలతో పాటు వలంటీర్లు కూడా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. వీరికి కూడా ప్రోత్సహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని భావిస్తున్నారు.