
- ఒక్కొక్కరికి రూ.5 వేలు ఫైన్
హైదరాబాద్సిటీ, వెలుగు: మూసారాంబాగ్ పరిధిలోని శాలివాహన నగర్లో నల్లాలకు మోటర్లను బిగించిన ఎనిమిది మందిపై వాటర్బోర్డు కేసులు నమోదు చేసింది. శాలివాహన నగర్ రోడ్ నంబర్ 12, 13,14 ప్రాంతాల్లో ఓ అండ్ఎం డివిజన్–2 అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా బిగించిన 8 మోటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఫైన్వేశారు. ఎవరికైనా తక్కువ ప్రెషర్ తో నీటి సరఫరా జరిగినా.. సరఫరాలో సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని వాటర్బోర్డు మేనేజర్, డీజీఎం, జీఎంలను సంప్రదించాలని లేదా కస్టమర్ కేర్ నంబర్155313కు ఫోన్చేయాలని అధికారులు సూచించారు.