
- ఫీల్డ్ విజిట్లో నీటి వృథాను చూసి విస్తుపోయినవాటర్బోర్డు ఎండీ
హైదరాబాద్సిటీ, వెలుగు: నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించే వారిని గుర్తించేందుకు వాటర్బోర్డు మంగళవారం నుంచి ‘మోటార్ఫ్రీ ట్యాప్’ డ్రైవ్ ను ప్రారంభించింది. ఎండీ అశోక్రెడ్డి, సిబ్బందితో కలిసి మాదాపూర్ కాకతీయ హిల్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిని వృథా చేస్తున్న తీరును చూసి విస్తుపోయారు. ఓ వ్యక్తి ఒక క్యాన్నెంబర్కు మరో అక్రమ కనెక్షన్ పెట్టుకోవడమే కాకుండా దానికి మోటార్పెట్టి మరీ నీటిని తోడుతూ చిక్కాడు.
అతనిపై కేసు నమోదు చేశారు. కొన్ని అపార్ట్మెంట్ల సంపుల్లోని నీరు ఓవర్ఫ్లో అయి బయటకు పోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసు ఫైల్చేశారు. రెండు చోట్ల నల్లాకు మోటర్లుపెట్టి బిల్డింగ్నిర్మాణం కోసం వినియోగిస్తుండడం గుర్తించారు. నీటిని వృథా చేయొద్దని వాటర్బోర్డు ఎండీ పలువురు అపార్ట్మెంట్వాసులకు అవగాహన కల్పించారు.
మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ లో భాగంగా మొదటి రోజు అన్ని డివిజన్లలో కలిపి 64 మోటార్లను సీజ్ చేయగా 84 మందికి మోటార్లు ఉపయోగించినందుకు.. నీటి వృథా చేసినందుకు పెనాల్టీ విధించారు. అత్యధికంగా ఎస్ఆర్ నగర్ పరిధిలో 25 మోటార్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారు. నీటి సరఫరాలో సమస్యలు వచ్చినా, నల్లాలకు మోటర్లు పెట్టి తోడుతున్నా కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.