షాకింగ్ : వందే భారత్ ట్రైన్ పైకప్పు లీకేజీ..

షాకింగ్ : వందే భారత్ ట్రైన్  పైకప్పు లీకేజీ..

ట్రైన్ జర్నీ అంటే ఎంతో ఇష్టపడతాం మనం.. ఇంక అదే కొత్తగా ఓపెన్ అయిన వందేభారత్ ట్రైన్ అయితే వాహ్.. అనుకుంటూ ట్రైన్ ఎక్కి గ్లాస్ నుంచి అందమైన ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తామ్.. అలాంటి ఎక్సపీర్యన్స్ కోసం ట్రైన్ ఎక్కుతాం.. కానీ అదే ట్రైన్ ఓ నరకమైతే.. వర్షంలో వ్యూ ఏమో కానీ పై కప్పు నుంచి నీళ్లు లీకైతే ఆ లీకవుతున్న నీరు మీ మీద పడితే.. ఇంకెలా ఉంటుంది.. ఒకసారి ఊహించుకోండి.. చెప్తేనే ఘోరంగా ఉంది కదా..

 ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న వందేభారత్ ట్రైన్ పై కప్పు నుంచి వర్షపు నీళ్లు లీకయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ ఇలా రాసింది.. వందేభారత్ రైలు పరిస్థితిని చూడండి. ఈ రైలు ఢిల్లీ-వారణాసి మార్గంలో నడుస్తుంది. వందే భారత్ సంఖ్య 22416 అని తెలిపింది. దీంతో నెటిజన్స్ అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. 

దీనిపై నార్తన్ రైల్వే స్పందిస్తూ పైపులు తాత్కాలికంగా మూసుకుపోవడంతో కోచ్‌లో కొద్దిపాటి నీటి లీకేజీ కనిపించింది!  రైల్లోని సిబ్బంది వచ్చి సరిచేశారని కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.