
- డివిజన్కు ఎన్ని ట్యాంకర్లు అవసరమవుతాయో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
- తక్కువ సమయంలో ఎక్కువ ట్యాంకర్లు సరఫరా చేసేలా ప్లాన్
- రద్దీ, ఇరుకు గల్లీల్లోకి వెళ్లలేకపోతున్న పెద్ద ట్యాంకర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు:గ్రేటర్లో వేసవి రాకముందే పెద్ద సంఖ్యలో వాటర్ట్యాంకర్లను బుక్చేసుకుంటున్నారు. ఎండలు తీవ్రమైతే బుకింగ్స్మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మెట్రో వాటర్బోర్డు అధికారులు అలర్ట్అయ్యారు. గతేడాది చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోవడంతో వాటర్ట్యాంకర్లకు డిమాండ్ఏర్పడింది. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పుడున్న నీటి ట్యాంకర్లు ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కుపోవడం, రాత్రి సమయాల్లో బస్తీలు, కాలనీల్లో ఇండ్ల ముందే కార్లు, టూ వీలర్ల వంటివి పార్క్ చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో మినీ వాటర్ట్యాంకర్లు నడిపించాలని బోర్డు నిర్ణయించుకుంది.
2,500 లీటర్ల ట్యాంకర్లు
బోర్డు వద్ద 725 ట్యాంకర్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో కొన్ని బోర్డు సొంతవి కాగా, మరికొన్ని అద్దెకు తీసుకున్నవి ఉన్నాయి. వీటితో 5 వేలు,10 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. గత ఏడాది ఈ ట్యాంకర్లను ఆర్టీఏతో పాటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్నారు. ఇందులో కొన్ని ట్యాంకర్లను తగ్గించి మినీ ట్యాంకర్లను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు.
ఈ మినీ ట్యాంకర్లతో 2,500 లీటర్లను సరఫరా చేయొచ్చు. గత ఏడాది 2,500 లీటర్ల సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లకు ఆర్డర్ఇచ్చినా అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఈసారి మాత్రం ముందు చూపుతో వాటిని తెస్తామని చెప్తున్నారు. అలాగే కొన్ని మినీ ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవాలని అద్దె ట్యాంకర్ల నిర్వాహకులకు సూచించారు.
లేకపోతే రేటు డబుల్
వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో డివిజన్కు ఎన్ని ట్యాంకర్లు అవసరమవుతాయో నివేదిక ఇవ్వాలని డివిజన్ల జీఎంలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి 50 నుంచి 100 ఎంజీడీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. గత వేసవిలో40 వేల కుటుంబాలు 70 శాతం ట్యాంకర్లు బుక్చేసుకోగా, ఇందులో 18 వేల కుటుంబాలకు మాత్రమే ఇంకుడు గుంతలున్నట్టు గుర్తించారు. 14వేల ఇండ్లకు నోటీసులిచ్చిన అధికారులు ఇంకుడు గుంతలు నిర్మించుకోకుంటే ట్యాంకర్ రేట్లు రెట్టింపు వసూలు చేయాలని నిర్ణయించారు.