రేపు, ఎల్లుండి హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో నల్లా బంద్

రేపు, ఎల్లుండి హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో నల్లా బంద్

హైదరాబాద్, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  వాటర్ బోర్డు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ -8, 15 పరిధిలోని లింగంపల్లి, పటాన్ చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లోని 900 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్లకు జంక్షన్ పనులు చేపడుతున్నందున్న నీటి సరఫరా నిలిచిపోనున్నట్టు పేర్కొన్నారు. 

అదేవిధంగా పఠాన్ చెరు, ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్ పేట్, డోయెన్స్ కాలనీ, ఎబ్ఐ ట్రైనింగ్ సెంటర్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ, టౌన్ షిప్, హెచ్ సీయూ, పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతాల్లోనూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించారు.