‘శ్వాగ్’ కంటెంట్ విషయంలో ప్రౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫీలవుతున్నాం

‘శ్వాగ్’ కంటెంట్ విషయంలో ప్రౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫీలవుతున్నాం

శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ హీరోయిన్. గత వారం విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ మీట్‌ను మంగళవారం నిర్వహించారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చాక కూడా మనల్ని వెంటాడే చిత్రాలు అరుదు. అలాంటి సినిమానే ‘శ్వాగ్’. ఇలాంటి కొత్త కథలు ట్రై చేస్తూ, రిస్క్ చేయకపోతే తర్వాతి తరాన్ని మనం ఇన్ స్పైర్ చేయలేం. నాకు మంచి గుర్తింపును ఇచ్చిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకునే క్రమంలో ఇలాంటి గొప్ప కథలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను’ అని చెప్పాడు. డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ ‘ప్రేక్షకుల నుంచి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మా రెండున్నర ఏళ్ల కష్టాన్ని మర్చిపోయాం. రాసేటప్పుడు, తీసేటప్పుడు బోల్డ్ కంటెంట్ అనుకోలేదు. కానీ చూసిన వాళ్లంతా బోల్డ్ కంటెంట్ అనడం కిక్ ఇచ్చింది’ అని అన్నాడు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. త్వరలో శ్రీవిష్ణు హీరోగా ఓ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే హసిత్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఏడాది మరో సినిమా చేయబోతున్నాం’ అని చెప్పారు. హీరోయిన్ దక్షా నగార్కర్, ఎడిటర్ విప్లవ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.