సీజ్​ఫైర్‎కు మేమూ సిద్ధమే, కానీ..: పుతిన్

సీజ్​ఫైర్‎కు మేమూ సిద్ధమే, కానీ..: పుతిన్

న్యూయార్క్: ఉక్రెయిన్‎తో కాల్పుల విరమణకు తామూ సిద్ధంగానే ఉన్నామని, కానీ దీనిపై కొన్ని సందేహాలు ఉన్నాయని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ డీల్‎కు సంబంధించి అనేక అంశాలపై చర్చించి, ఒక నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. దీనిపై త్వరలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‎తో మాట్లాడతానని చెప్పారు. 

కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ బుధవారం హెచ్చరించిన నేపథ్యంలో పుతిన్ గురువారం ఈ మేరకు స్పందించారు. ఉక్రెయిన్ సమస్యపై దృష్టి సారించి, శాంతి స్థాపనకు కృషి చేస్తున్నందుకు గాను భారత ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్‏కు ధన్యవాదాలు తెలిపారు.

ఇది తాత్కాలిక ఉపశమనమే.. 

ఉక్రెయిన్–రష్యా మధ్య సీజ్ ఫైర్​కోసం యూఎస్–ఉక్రెయిన్​చేసిన ప్రతిపాదనపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్‎కు సన్నిహితంగా ఉండే ఉన్నతాధికారి యూరి ఉషాకోవ్ విమర్శలు చేశారు. ఇది ఉక్రెయిన్​ఆర్మీకి  తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వ్యాఖ్యానించారు. కురుస్క్ నుంచి ఉక్రెయిన్​బలగాలు వెనక్కి ఓవైపు 30 రోజుల సీస్​ఫైర్​పై అమెరికా ఆధ్వర్యంలో చర్చలు జరుగుతుంటే రష్యా అధికారులు కీలక ప్రకటన చేశారు. 

రష్యాకు చెందిన కుర్స్క్​బోర్డర్​ నుంచి ఉక్రెయిన్​దళాలను తరిమికొట్టినట్టు ప్రకటించారు. కుర్క్స్​ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్‌‌‌‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం అక్కడ పుతిన్‌‌‌‌ పర్యటించారు. తర్వాత కొన్ని గంటల్లోనే అధికారులు ఉక్రెయిన్​ దళాలను వెళ్లగొట్టినట్టు ప్రకటించాయి. అయితే, దీనిపై ఉక్రెయిన్​ నుంచి ఎలాంటి స్పందన  రాలేదు.