
కూకట్పల్లి, వెలుగు: అంబేద్కర్ అడుగుజాడల్లో అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో అన్ని రంగాల్లో రాణించాలంటే అంబేద్కర్ మార్గం అనుసరణీయమన్నారు. కూకట్పల్లి దయార్గూడలో అంబేద్కర్ విగ్రహం వద్ద సింగూరు పాండు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి మంగళవారం శంకుస్థాపన చేశారు.
అంబేద్కర్విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. దళితులు ఐక్యంగా ముందుకు సాగితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. షెడ్డు నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ఇన్చార్జ్బండి రమేశ్, కాంగ్రెస్నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, సంజీవ, మేకల రమేశ్, మధుగౌడ్, నరసింహ, జ్యోతి, సుధ, స్వరూపగౌడ్పాల్గొన్నారు.