
బషీర్బాగ్, వెలుగు: హింసలేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ది ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీకల్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ (ఓజీఎస్ హెచ్) అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.శాంత కుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో మహిళలపై హింస చేయొద్దు అనే అంశంపై అవగాహన కల్పించి, వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క, పరిశ్రమలు, వాణిజ్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరుకానున్నట్లు తెలిపారు.