
నిజామాబాద్, వెలుగు: ఇందూరు జిల్లా ప్రజల చిరకాల కోరికైన ప్రభుత్వ వ్యవసాయ, ఇంజినీరింగ్ కాలేజీలు తప్పక తెస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్హామీ ఇచ్చారు. ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన ఇందూర్లో మినీ స్టేడియం, సింథటిక్ట్రాక్ నిర్మిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ లోని 40 డివిజన్గౌతంనగర్ లో పేద కుటుంబం ఇంట్లో ఆయన సన్న బియ్యం అన్నం తిన్నారు. అనంతరం డీసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నందిపేట సెజ్ను పూర్తిస్థాయిలో నిర్మిస్తామన్నారు.
వ్యవసాయపరంగా ఉత్తర తెలంగాణలో నిజామాబాద్జిల్లా వైభవం గత బీఆర్ఎస్హయాంలో దెబ్బతిన్నదని.. పునర్నిర్మించే చర్యలు చేపట్టామన్నారు. ప్రధాని మోదీ రూపొందిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు నాడు కేసీఆర్మద్దతు ఇవ్వగా కాంగ్రెస్ అన్నదాతల పక్షాన పోరాడి రద్దు చేయించిందన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడంతో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల వరి సాగు 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. 281 లక్షల మెట్రిక్టన్నుల వడ్ల దిగుబడితో దేశంలో ఫస్ట్ ప్లేసులో నిలిచిందన్నారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లను బియ్యంగా రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు ఇస్తూ ఆకలి తీరుస్తున్నామన్నారు. ఇది కూడా దేశంలోనే రికార్డన్నారు. ప్రాణహిత 21,22,23 ప్యాకేజీలు పూర్తి చేయిస్తామని, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో పూడిక తీయించి, మరో లక్షన్నర ఎకరాల సాగు పెంచుతామన్నారు. గుత్ప, అలీసాగర్ లిఫ్టుల స్థాయి పెంచుతామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు రూపొందించామన్నారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు సాధిస్తామన్నారు. బోధన్ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, స్టేట్కార్పొరేషన్ చైర్మన్లుతాహెర్, మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, డీసీసీబీ చైర్మన్కుంట రమేశ్రెడ్డి, శేఖర్గౌడ్, రత్నాకర్, జావెద్ అక్రమ్, రాంభూపాల్, రామకృష్ణ, సంతోష్, ప్రమోద్, వేణురాజ్, బొబ్బిలి రామకృష్ణ, మధు తదితరులు ఉన్నారు.