ఎంఎస్​ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తం: మంత్రి శ్రీధర్ ​బాబు

ఎంఎస్​ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తం: మంత్రి శ్రీధర్ ​బాబు

హైదరాబాద్​, వెలుగు: ఎంతో మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ) అభివృద్ధి కోసం ఎంఎస్​ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి డి.శ్రీధర్​బాబు చెప్పారు. వీటి ఏర్పాటుకు నిపుణుల సలహాలను తీసుకుంటామని, అంతర్జాతీయ స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎంఎస్​ఎంఈల అభివృద్ధి కోసం కొత్త పాలసీని తీసుకొచ్చామని, దానికి సంబంధించిన ఆపరేషనల్​ గైడ్​లైన్స్​ను త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు.

హైదరాబాద్​లో శుక్రవారం ఫెడరేషన్​ ఆఫ్​ తెలంగాణ చాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీస్​ (ఎఫ్​టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ స్పార్క్​ 2.O సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎంఎస్​ఎంఈల ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామన్నారు.