కొత్తగూడెంలో వెయిట్​లిఫ్టింగ్ పోటీలు

కొత్తగూడెంలో వెయిట్​లిఫ్టింగ్ పోటీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్​ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి క్రీడాకారులు ప్రతిభ చూపాలని కంపెనీ జీఎం వెల్ఫేర్​ పి. సామ్యూల్​ సుధాకర్ ​కోరారు. కొత్తగూడెంలోని సీఈఆర్​ క్లబ్​లో వర్క్​ పీపుల్​ అండ్​ గేమ్స్​ ఆధ్వర్యంలో  పవర్, వెయిట్​ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్​ పోటీలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చూపి కోల్​ ఇండియా పోటీలకు సెలెక్ట్​ కావాలని సూచించారు. 11 ఏరియాల నుంచి 40 మంది మహిళా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో జీఎం సెక్యూరిటీ కె. శ్రీనివాస్​, ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ నేతలు ఎస్​వి. రమణమూర్తి, పీతాంబరం, సీనియర్​ పీవో టి. శ్రీనివాసరావు, స్పోర్ట్స్​ సూపర్​ వైజర్​ ఎంసీ పోస్​నెట్​, కో ఆర్డినేటర్​ రమేశ్​  పాల్గొన్నారు.