
న్యూఢిల్లీ: కోవర్కింగ్ కంపెనీ వీవర్క్ ఇండియా సోమవారం రైట్స్ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సేకరించింది. అప్పులను తగ్గించి, మరింత వృద్ధిని సాధించడానికి ఈ నిధులను ఉపయోగించనుంది. అన్లిస్టెడ్ వీవర్క్ ఇండియాలో, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్కు 73 శాతం వాటా ఉండగా, వీవర్క్ గ్లోబల్కు 27 శాతం వాటా ఉంది.
ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ ప్రొవైడర్ అయిన వీవర్క్ గ్లోబల్... జూన్ 2021లో వీవర్క్ ఇండియాలో 100 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. ఎంబసీ గ్రూప్ కూడా భారీ పెట్టుబడి పెట్టింది. ఈ ఇష్యూతో వచ్చిన డబ్బుతో తమ అప్పులన్నీ తీరిపోతాయని వీవర్క్ ఇండియా ఎండీ, సీఈఓ కిరణ్ వీర్వానీ చెప్పారు.