బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్ : నటి హేమపై టాలీవుడ్ ఇప్పుడు ఏం చేయబోతుంది?

బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్ : నటి హేమపై టాలీవుడ్ ఇప్పుడు ఏం చేయబోతుంది?

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్ షీట్లో తెలిపారు. MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్లో జతపర్చారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు  వివరించారు. రేవ్ పార్టీ నిర్వహకులుగా 9 మందిని చార్జిషీట్ లో పేర్కొన్నారు పోలీసులు. 

ఈ నేపథ్యంలో నటి హేమపై..టాలీవుడ్ ఏం చేయబోతుంది..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎలాంటి నిర్ణయం తీసుకోబుతుందనే..సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో డ్రగ్స్ కేసు, రేవ్ పార్టీలో హేమ పాల్గొందని వివాదాస్పదం కారణంగా.. MAA అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది. ఆపై రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకోలేదని, పోలీసుల టెస్ట్ లో నెగిటివ్ రావడంతో..MAA అసోసియేషన్ విధించిన సస్పెన్షన్ ఎత్తివేసింది.

ALSO READ | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జిషీట్.. హేమ డ్రగ్స్ తీసుకుంది

ఈ క్రమంలో తాజాగా దాఖలు చేసిన చార్జ్ షీట్ లో.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించడంతో MAA అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి. అలాగే మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు ఎలాంటి ప్రకటన చేయనున్నాడనే ఆసక్తి నెలకొంది. ఒక విధంగా బెంగళూరు రేవ్ పార్టీలో కేసు ట్విస్ట్ లతో సాగుతోందని సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.