
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా (Mazaka) మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ శివరాత్రి (2025 ఫిబ్రవరి 26న) సందర్భంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది.
లేటెస్ట్గా ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను జీ5 అఫీషియల్గా ప్రకటించింది. ఈ శుక్రవారం (మార్చి 28) నుంచి జీ5 ఓటీటీలో మజాకా స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే, మజాకా సినిమా విడుదలకు ముందు ఆడియన్స్ నుంచి క్రేజీ టాక్ రావడంతో, మంచి ధరకే ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
A biggg dose of summer fun, awaits you! 🤩
— ZEE5 Telugu (@ZEE5Telugu) March 25, 2025
Get ready for #MazakaOnZee5 from 28th March
🔗https://t.co/v7IhjluLXp@sundeepkishan @riturv #RaoRamesh @AnshuActress @TrinadharaoNak1 @KumarBezwada @leon_james @AnilSunkara1 @RajeshDanda_ @balajigutta @lemonsprasad pic.twitter.com/ePwW1LVoiC
ఇదిలా ఉండగా.. సందీప్ కిషన్ నటించిన "ఊరి పేరు భైరవకోన" సినిమా సూపర్ హిట్ అయ్యింది. దర్శకుడు వీఐ ఆనంద్(VI Anand) తెరకెక్కించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఓవర్ ఆల్ గా రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మోస్తారు లాభాలు తెచ్చిపెటింది. ఈ సినిమాకి థియేటర్స్ లోనే కాకుండా, ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మజాకా ఎలాంటి ఫీల్ ఇస్తుందో చూడాలి.
Also Read:-ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్..
రైటర్ ప్రసన్న కుమార్.. డైరెక్టర్ త్రినాథరావులది ఇంట్రెస్టింగ్ కాంబో. వీరి కలయికలో వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా పెద్దగా దక్కించుకోలేదు. రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజైన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద రూ.9కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పెద్దగా ఆశించినంత లాభాలను చూడలేకపోయాడు. ఇందులో రావు రమేష్, వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ, సుప్రీత్, అజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.