- తెలంగాణకు గోదావరి జలాల కోసం సహకరించాం
- కేసీఆర్ జైలుకు పోవుడు పక్కా
- మహారాష్ట్ర డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
తొర్రూరు/నర్సంపేట, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరిపిస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలకుర్తి బీజేపీ అభ్యర్థి లేగా రామ్మోహన్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. పేరుకు బీఆర్ఎస్అయినా ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మారిందన్నారు. 2015లో సీఎం కేసీఆర్.. జలవివాదాల పరిష్కారం కోసం తాను సీఎంగా ఉన్న సమయంలో మహారాష్ట్రకు రాగా ఇక్కడి ప్రజల కోసం సహకరించినట్టు తెలిపారు. కాళేశ్వరం,మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ బీఆర్ఎస్ అవినీతి మూలంగా అవి కూలిపోయే దశకు చేరుకున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, నాయకులు చింత సాంబమూర్తి, యాప సీతయ్య, పూసల శ్రీమాన్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ ఏనాటికైనా కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. నర్సంపేటలో కంభంపాటి పుల్లారావు (ప్రతాప్) ను గెలిపించాల్సిందిగా కోరారు. ఎడ్ల అశోక్రెడ్డి, గూడూరు సందీప్, జూలూరి మనీష్, నర్సింహారావు, జగన్ పాల్గొన్నారు.
సకల జనుల సమ్మెతోనే తెలంగాణ వచ్చింది
దేవరకొండ : కాంగ్రెస్, బీఆర్ఎస్లతో తెలంగాణ ఏర్పాటు కాలేదని, సకల జనుల సమ్మెతోనే వచ్చిందని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని, పెట్రోలు, డీజిల్పై వ్యాట్ట్యాక్స్తగ్గించడంతో పాటు రూ.15 వరకు తక్కువ చేస్తామన్నారు. ఏడాదికి నాలుగు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే రూ.2 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్, బీజేపీ అభ్యర్ధి కేతావత్లాలూనాయక్, ప్రేమేందర్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ ఆర్.ప్రదీప్కుమార్, కర్నాటిసురేశ్, ఏటీ కృష్ణ, అంకూరి నర్సింహ, చెనమోని రాములు, వికాస్ రాథోడ్, దానం శ్రీనివాస్, సినీ హీరో సర్ధార్నాయక్, నక్క వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు.