- ఎన్నికల కోడ్ ముగిసి 25 రోజులు గడుస్తున్నా ఆ ఊసే లేదు
- కమిటీ అప్రూవల్ కోసం పలు ఫైళ్లు వెయిటింగ్
- మీటింగ్ పెట్టి అప్రూవ్ చేస్తే అభివృద్ధి పనుల్లో వేగం పెరిగే చాన్స్
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసి 25 రోజులు గడుస్తున్నా సమావేశాల ఊసే లేదు. దీంతో అభివృద్ధి పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ ఏర్పడిన తరువాత ఈ ఏడాది మార్చి 6న ఒక్క సమావేశం మాత్రమే జరిగింది. మార్చి16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 5న కోడ్ ముగిసినప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్టాండింగ్కమిటీ సమావేశం నిర్వహించలేదు. వాస్తవానికి ప్రతి వారం స్టాండింగ్కమిటీ మీటింగ్జరగాల్సి ఉంది.
కోడ్ ముగిశాక మొన్నటిదాకా బల్దియా కమిషనర్ గా పనిచేసిన రొనాల్డ్రోస్సెలవులపై వెళ్లడంతో సమావేశాలకు బ్రేక్పడుతూ వచ్చింది. తిరిగొచ్చిన తర్వాత రోజున ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆమ్రపాలి చార్జ్తీసుకున్నారు. మరి వచ్చే వారమైనా స్టాండింగ్కమిటీ సమావేశం నిర్వహిస్తారో లేదో చూడాలి. కమిటీ అప్రూవల్ కోసం పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లు వెయిట్చేస్తున్నాయి. మేజర్ పనులకు సంబంధించి 10 ఫైళ్లు పెండింగ్ఉన్నాయి. సమావేశం జరిగితే అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ కనుసైగల్లో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగేది. ఆయన నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అప్రూవల్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. స్టాండింగ్ కమిటీలో చర్చించి డెవలప్ మెంట్ కి సంబంధించి ఏది అవసరమో దానికే సభ్యులు అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంది. బల్దియా కమిషనర్కు రూ.2 కోట్ల వరకు పనులకు అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అంతకు మించి రూ.5 కోట్ల వరకు పనులను ఓకే చేయాలంటే స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తప్పనిసరి.