ప్రధానికి దక్కిన అరుదైన గౌరవం

ప్రధానికి దక్కిన అరుదైన గౌరవం

కిర్గిజ్ స్థాన్ లో షాంఘై కోఅపరేషన్ ఆర్గనేషన్ సదస్సులో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బిష్కేక్ వేదికగా జరిగిన ఈ సదస్సుకు భారత పీఎం మోడీ తో పాటు పలు దేశాల ప్రధానులు హాజరయ్యారు.

ప్రధాని మోడీ ఆ సదస్సులో జరిగే సమావేశానికి వస్తున్న సమయంలో హఠాత్తుగా చిరుజల్లు కురిసింది. ఆయన వెంటే వస్తున్న కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సూరన్ బే జీన్బెకవ్  వర్షానికి తడవకుండా మోడీని గొడుగు పట్టి సాదరంగా తీసుకుని వెళ్లారు. అదే సమయంలో ఫోటో గ్రాఫర్లు ఓ క్లిక్ చేశారు. అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. మన దేశ ప్రధానికి దక్కిన అరుదైన గౌరవంగా దీనిని భావిస్తున్నారు.

అచ్చం ఇలాంటి ఘటనే శ్రీలంకలో జరిగింది. గతవారం ప్రధాని శ్రీలంక పర్యటన  చేశారు. ఆ దేశ అధ్యక్షుడు  మైత్రిపాల సిరసేన.. ప్రధాని మోడీని స్వాగతించే సమయంలో వర్షం పడడంది. దీంతో సిరిసేన తాను తడవకుండా ఉండేందుకు గొడుగును వాడారు.  కానీ ఆ విజువల్స్ లో మన మోడీకీ సిరిసేన గొడుగు పట్టినట్టుగా కనిపించింది.

మొత్తానికి ఈ రెండు సంఘటనలు  యాదృచ్చికంగా జరిగినా మన దేశా ప్రధానికి, ఇతర దేశ ప్రధానులు గౌరవిస్తున్నట్టు ఉండడం చూడ్డానికి చాలా బాగుందంటున్నారు దేశ ప్రజలు.