
అక్షయ తృతీయ 2025: అక్షయ తృతీయ ఏప్రిల్ 30, బుధవారం... హిందూ మతం ప్రకారం, ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం మరియు కొనడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొనుగోలు చేసిన బంగారు వస్తువులు ఎప్పుడూ తగ్గవు ... ఎల్లప్పుడూ పెరుగుతాయని నమ్ముతారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ రాశివారు ఏమి కొని దానం చేయాలో తెలుసుకుందాం. .
మేషరాశి: బంగారు ఉంగరం కొనుక్కొని.. బార్లీ, ధాన్యాలు దానం చేయండి.
వృషభ రాశి: వెండి నాణేలు .. పాదరక్షలు కొనడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారు పండ్లను దానం చేయండి.
మిథున రాశి: పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాశి వారు బంగారు గొలుసు .. చెవిపోగులు... వెండి ఆభరణాలు కొంటే శుభ ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు. 11 మంది బ్రాహ్మణులకు ఆకుపచ్చ కూరగాయలు .. పండ్లను దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
కర్కాటక రాశి: వెండితో చేసిన వస్తువులు కొంటే మంచిది. ఈ రాశి వారు పేదలకు కొత్త బట్టలు .. దానిమ్మ పండ్లు దానం చేయాలి.
సింహ రాశి: బంగారు లాకెట్ .. గొలుసు కొనండి .. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి. పేదవారికి అన్నదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి: బంగారు గాజులు.. ముక్కుపుడక .. ఉంగరం కొనండి . దగ్గరలోని దేవాలయానికి వెళ్లి స్వామి వారికి పండ్లను సమర్పించండి. దేవాలయ పూజారికి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి.
తులా రాశి: వెండి పాదరక్షలు కొనండి. పిండి, పాలు, పెరుగు వంటి తెల్లటి వస్తువులు దానం చేయండి.
వృశ్చిక రాశి : బంగారు ముక్కుపుడక... ఉంగరం కొనండి. రాగి పాత్ర కొనడం ... స్వీట్లు దానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు బంగారు గొలుసు కొనుగోలు చేయాలి. పేదలకు పండ్లు దానం చేయడం వలన అంతా మంచే జరుగుతుంది.
మకరం .. కుంభ రాశి: ఈ రెండు రాశుల వారు ఫర్నిచర్తో పాటు బంగారం ... వెండి ..ఆభరణాలుకొనాలి. కాళ్ళకు సంబంధించిన వస్తువులను కొనడం శుభప్రదం. బ్రాహ్మణుడికి మిఠాయిలు ....పప్పు దానం చేయండి.
మీనం: బంగారు గాజులు, నెక్లెస్ .. వెండితో తయారుచేసిన చెవిపోగులు వంటి ఆభరణాలను కొనండి. ఈ రాశి వారు పసుపు రంగు స్వీట్లను దానం చేయండి.
►ALSO READ | ఏప్రిల్ 30న అక్షయ తృతీయ.. బంగారం కొనేందుకు శుభ ముహూర్తం ఇదే..!