వినాయక మండపంలో కరెంట్ షాక్​తో యువకుడు మృతి

వినాయక మండపంలో కరెంట్ షాక్​తో యువకుడు మృతి

జీడిమెట్ల :  వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తో ఓ యువకుడు చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. పేట్​బషీరాబాద్ పీఎస్​ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్​చారి(28) బస్సు బాడీ లేబర్  పనిచేస్తుంటాడు. శుక్రవారం రాత్రి వినాయక మండపం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. మండపం పై నుంచి వర్షం నీరు కిందికి రాకుండా టార్పాలిన్​తో కడుతున్నాడు.  

ఇనుప బైండింగ్ వైర్ ని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో మండపం పైకి విసిరాడు.  బైండింగ్ వైర్ విద్యుత్ తీగలకు తగలడంతో నవీన్​చారి షాక్​తో పడిపోయాడు. అక్కడే ఉన్న వడ్ల శంకర్ చారి (40) కర్ర సాయంతో నవీన్ చారిని పక్కకు జరిపే ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ తగిలింది. నవీన్ చారి మృతి చెందగా, శంకర్ చారి చికిత్స పొందుతున్నాడు.