
నూతన తెలుగు సంవత్సరం విశ్వావశు నామ సంవత్సరం మార్చి 30 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు. సూర్యుని పాలన ఎలా ఉంటుంది.. స్థితి గతులు ఎలా ఉంటాయి..అతని పాలన వల్ల ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..
హిందూ పంచాంగం ప్రకారం ఒకొక్క తెలుగు సంవత్సరానికి ఒకొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం. మార్చి 30 వ తేదీ ఆదివారం పాడ్యమి తిధి నుంచి ఈ విశ్వవసు నామ సంవత్సర మొదలు కానుంది. మనిషి ప్రకృతికి... కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు.. మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది.
ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అంటే సృష్టి ప్రారంభం అయిన రోజు. హిందూ పంచాంగం ప్రకారం ఒకొక్క తెలుగు సంవత్సరానికి ఒకొక్క పేరు ఉంటుంది.కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం 2025 మార్చి 30 వ తేదీ ఆదివారం నుంచి మొదలు కానుంది. అంటే ఈ సంవత్సరం అధిపతి సూర్యుడు. రాజులు అంటే పాలకులు అని అర్దం.
ఉగాది పండగ రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అందువలన కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో కనపడతాయని పండితులు అంటున్నారు. ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉండటంతో ప్రజల్లో ఆనందం, శాంతి ఉంటుంది. అయితే ఎవరైనా చేసే పనులకు సంబంధించి ఆయా ప్రయత్నాలలో బలం, సామర్థ్యం ఉంటుంది. విజయం సాధించాలంటే తెలివితేటలను ఉపయోగించాల్సిందే. ఉగాది రోజున పంచాంగ శ్రవణం, ఏడాదిలో తమ భవిష్యత్ ఎలా ఉంటుంది.. ఆదాయ వ్యవయాల గురించి తెలుసుకోవడం.. జాతకాన్ని వినడం ,యు గ్రహ కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలి అనే అంచనాకు వస్తారు.
Also Raed : మార్చి 29 సూర్యగ్రహణం: ఆ సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే..
నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. ఈ మేరకు తమ జాతకం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండనుందని కూడా తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. ఈ సంవత్సరంలో విశ్వావసు సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుందని పండితులు చెబుతున్నారు.. దొంగతనాలు పెచ్చుమీరతాయంటున్నారు.
కొత్త సంవత్సరంలో ( మార్చి 30 నుంచి) మొక్కలు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందట. దీంతో రైతులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉందటుంది. అయితే పండిన పంటకు రేటు అధికంగా ఉంటుంది. అందువలన రైతులకు సంపద విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పంచాగం ద్వారా తెలుస్తుంది. ఇక డబ్బు విషయంలో... చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదట. ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా పడతాయి. అందువలన కరువు ఏర్పడదు. కొత్త వ్యాధులు వ్యాపించడం... అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో నిండి ఉంటారు.
ఉగాది ప్రారంభంలో ఐంద్ర యోగం ఉంటుంది. ఐంద్ర యోగం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికత వైపు నడిపించే యోగ ప్రక్రియ అని అర్థం . శుభ యోగంగా పరిగణించబడుతుంది. కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైనది. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. చంద్రగతిని అనుసరించి మార్చి 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వావశు నామ సంవత్సరం భవ కారణంతో మొదలవుతుంది. కనుక ఏ పని చేయాలన్న పండితులను సంప్రదించి.. ముహూర్తం.. శుభతిథి ప్రకారం పనినిప్రారంభిస్తే సంపద.. వారం వల్ల – ఆయుషు... నక్షత్రం వల్ల పుణ్యం... యోగం వల్ల వ్యాధినాశం... కరణం వల్ల ఎలాంటి ఆటకాలు లేకుండా విజయం వరిస్తుందని పంచాగకర్తలు చెబుతున్నారు.