ఎవరి మెప్పు కోసం సీపీని ట్రాన్స్​ఫర్​ చేశారు: ఎంపీ రఘునందన్​రావు

ఎవరి మెప్పు కోసం సీపీని ట్రాన్స్​ఫర్​ చేశారు: ఎంపీ రఘునందన్​రావు

సిద్దిపేట: ఎప్పుడు ఎవరు జైల్​కి వెళ్తారో తెలియని పార్టీతో బీజేపీకి పొత్తు ఉండదని మెదక్​ ఎంపీ రఘునందన్​రావు  విమర్శించారు. ఇవాళ సిద్దిపేట టౌన్​లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవన్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయికి ఎదుగుతారు.  

ALSAO READ | హైడ్రా పేరిట హడావుడి

ప్రతి ఒక్కరు బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలి. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేశాడు. దేశ హితం కోసమే బీజేపీ పనిచేస్తుంది. దేశ సంస్కృతిని కాంగ్రెస్​, కమ్యూనిస్టు పార్టీలు తుంగలో తొక్కాయి.   సిద్దిపేట గడ్డ నుంచే మార్పు మొదలైంది. ఈ విషయం కొంతమంది నాయకులకు మొన్నటి ఎన్నికలు కనువిప్పు కలించాయి.  రేవంత్​ రెడ్డి పాలన గాడి తప్పుతుంది. వినాయక చవితి వేడుకలు స్టాట్​అయితే కానిస్టేబుల్​ను కూడా ట్రాన్స్​ఫర్​ చేయరు, కానీ సీపీలను మారుస్తున్నరు. హైదరాబాద్​ కమిషనర్​ను ఎవరి మెప్పు కోసం కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డిని ట్రాన్స్​ఫర్​ చేశారని రఘునందన్​విమర్శించారు.