వానల్లోనే పురుగులు బయటకు ఎందుకొస్తాయి.. మిగతా కాలంలో ఏం చేస్తాయి.. ఎక్కడ ఉంటాయి..?

వానల్లోనే పురుగులు బయటకు ఎందుకొస్తాయి.. మిగతా కాలంలో ఏం చేస్తాయి.. ఎక్కడ ఉంటాయి..?

చల్లని వాతావరణం, పచ్చదనం, తాజాదనంతో వానాకాలం అంటేనే ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంటుంది. అయితే పురుగులు ఎక్కువగా కనిపించేది ఈ సీజన్లోనే. అందుకు కారణం ఏంటో తెలుసా?. దీని వెనుక ఉన్న థియరీని పాపులర్ నేచురలిస్ట్ 'పూచీ' వెంకట్ వివరిస్తున్నాడు. "పురుగులు సాధారణంగా అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తుంటాయి. అప్పటిదాకా అవి సుప్తావస్థ (నిద్రాణవస్థ)లో ఉంటాయి.

 ఈ స్థితిని డయాపౌజ్ అంటారు. వానలు మొదలయ్యాక ఆ స్థితి నుంచి అవి బయటకు వస్తాయి. తేమ అనుకూల వాతావరణం కావడంతో అవి స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. పైగా మొక్కలు, పువ్వులు ఎక్కువగా కనిపించేది ఈ సీజన్లోనే. అందుకే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, రెక్కల చీమలు, మిగతా పురుగులు ఆహారం కోసం తిరుగుతుంటాయి. వాటిని వెతుక్కుంటూ పక్షులు, గబ్బిలాలు, బల్లులు.. ఇలా మిగతావి వేటాడుతాయి. 

Also Read:-డ్రగ్స్ మత్తులో మొసళ్లు!! ..నీళ్లలోంచి దూసుకొస్తున్నయ్

యానిమల్ లైఫ్ సైకిల్ లో రెయిన్ సీజన్ ఒక బ్యూటీఫుల్ కనెక్షన్గా వర్ణిస్తున్నాడు. ఆయన. అంతేకాదు ప్రకృతిలో ఎలాంటి మార్పులు సంభవించినా సరే.. పురుగులు తమకు అనుకూలంగా మార్చుకోగలవని చెప్తున్నాడు. ఈ విషయంలో చీమలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయట. 'తర్వాతి తరాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చీమలకు బాగా తెలుసు. అందుకే వాతావరణాన్ని ఒక అంచనా వేసుకుని మరీ గుడ్లు పొదుగుతాయి. ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి' అని వివరించాడు వెంకట్.