అమ్మో.. ఇంత పెద్ద కుట్రనా.. పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా..!

అమ్మో.. ఇంత పెద్ద కుట్రనా.. పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా..!

లెబనాన్లో జరిగిన పేజర్ పేలుళ్ల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. పేజర్లు పేలడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2,800 మంది గాయపడ్డారు. ఈ పేజర్స్లో 3 గ్రాముల పరిమాణంలో పేలుడు పదార్థాలను అమర్చి ఈ నరమేధం సృష్టించారని తేలింది. ఇజ్రాయెల్కు లొకేషన్ ​చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సభ్యులంతా పేజర్లను వాడుతున్నారు. వీటి ద్వారానే కీలక సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. మంగళవారం పేలిన పేజర్లను తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో సంస్థనుంచి లెబనాన్​కు దిగుమతి చేసుకున్నట్టు న్యూయార్క్​టైమ్స్​పత్రిక నివేదించింది.

ఇందులో ‘ఏఆర్924’ మోడల్​కు చెందిన పేజర్లు 3000 వరకు ఉన్నట్టు పేర్కొన్నది. పేజర్ డివైస్ లో బ్యాటరీ కింది భాగంలో పేలుడు పదార్థాన్ని అమర్చి, ఒక స్విచ్ కూడా అమర్చారని సమాచారం. ఈ స్విచ్ ద్వారా రిమోట్ కంట్రోల్తో పేజర్ను పేల్చేసినట్లు తెలిసింది. పేజర్లో 90 గ్రాముల పరిమాణంలో రీఛార్జబుల్ లిథియం బ్యాటరీ ఉంది. ఈ పేజర్ డివైజ్కు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సభ్యులు ఒక మెసేజ్ పంపగానే పేజర్లు పేలిపోయాయి. ఆ మెసేజ్ వచ్చిన కొన్ని సెకన్ల పాటు పేజర్ బీప్ శబ్దం చేస్తుంది. ఆ తర్వాతే పేలిపోతుంది.

అసలు పేజర్ అంటే..
మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు అత్యవసర సందేశాలు పంపుకునేందుకు వినియోగించిన ఒక చిన్న సైజ్ వైర్లెస్ డివైజే ఈ పేజర్. వాయిస్ కాల్స్ చేయలేం కానీ టెక్ట్స్ మెసేజెస్ను ఈ పేజర్ డివైజ్ చేరవేస్తుంది. 1980, 90ల్లో ఈ పేజర్ డివైజ్ మోస్ట్ పాపులర్. మొబైల్ ఫోన్లు వచ్చాక ఈ పేజర్లు రానురానూ కనుమరుగైపోయాయి. ఈ డివైజ్లను తయారు చేసే కంపెనీలు కూడా ఉత్పత్తిని నిలిపివేశాయి. 

ALSO READ : నిన్న పేజర్లు.. ఇయ్యాల వాకీటాకీలు : లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు

ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈరోజుల్లో కూడా హెజ్బొల్లా మిలిటెంట్లు ఈ పేజర్లనే ఎందుకు వాడారంటే.. పేజర్లయితే మొబైల్ ఫోన్ల మాదిరిగా లొకేషన్ను ట్రాక్ చేయలేరు. పేలుళ్లకు మొబైల్ ఫోన్లు వినియోగిస్తే ఏం జరుగుతుందో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్కు బాగా తెలుసు. గత ఫిబ్రవరిలో ఈ గ్రూప్ జనరల్ సెక్రటరీ హసన్ నస్రల్లా తన గ్రూప్ సభ్యులను ఈ మేరకు హెచ్చరించాడు కూడా. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కంటే ఫోన్లే తమకు ప్రమాదకరమని.. ఫోన్లను పగలగొట్టాలని లేదా ఐరన్ బాక్స్లో పెట్టి లాక్ చేయాలని మిలిటెంట్ గ్రూప్ సభ్యులను హసన్ నస్రల్లా హెచ్చరించాడు.