ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్

ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్

కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ నయనతార(Nayanthara) అంటే సూపర్ యాక్టర్. వరుస సినిమాలతో బిజిబిజీగా ఉంటుంది. అలాగే సినిమా అయినా, యాడ్స్ అయినా తనదైన స్టైల్ లో రెమ్యునరేషన్ వసూలు చేస్తుంది. ఆమధ్య ఓ పదినిమిషాల యాడ్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందట.

ఈ క్రమంలో నయనతారపై ఓ ఇంటర్వ్యూలో నిర్మాత, యూట్యూబర్ అనంతన్ మండిపడ్డారు. ఆమె ఇప్పుడు తన పిల్లలను చూసే ఇద్దరు నానీలను సెట్స్‌కు తీసుకువస్తోందని, వారి ఖర్చులను కూడా నిర్మాతలు భరించాలని భావిస్తున్నారని అనంతన్ ఆరోపించారు.

'నయనతార తన పిల్లల కోసం ఇద్దరూ ఆయాలతో షూటింగ్ లొకేషన్స్కి వస్తోంది. వాళ్లకి నిర్మాతలు డబ్బులు చెల్లించాలని అంటోంది. ఇదెక్కడ న్యాయం, ఆమె పిల్లల నానీలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత నిర్మాతలది కాదు. ఆమె తన వ్యక్తిగత విషయాలపై కూడా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోంది. తన పెళ్లిని కూడా నెట్ ఫ్లేక్స్ కు, భారీ మొత్తానికి (పెళ్లి వీడియో 25 కోట్ల రూపాయలకు) అమ్మేసింది. నయనతార ప్రతిదీ వ్యాపారంగా మార్చుకుంది' అంటూ నిర్మాత వాపోయాడు. గతంలో ఈయనే.. సెట్‌కి వచ్చేటప్పుడు నయన్ ఏకంగా 8 మందిని తీసుకొస్తుందని కామెంట్స్ చేశాడు. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో చూడాలి. 

ALSO READ | రాజేంద్రప్రసాద్ను పరామర్శించిన హీరో ప్రభాస్..

విఘ్నేశ్‌ శివన్ను ప్రేమించి  2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది నయన్. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె.. ప్రస్తుతం ఆమె ది టెస్ట్(The Test) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మలయాళం సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది.