
- అందమైన యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు
- వారితో బ్రాండెడ్లిక్కర్, ఫుడ్ఆర్డర్ఇప్పిస్తూ దోపిడీ
- పట్టుబడిన 16 మంది గర్ల్స్
దిల్ సుఖ్ నగర్, వెలుగు: కొంతకాలం కింద ముంబయి, ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్లోని పలు బార్లలో బార్గర్ల్స్అని ఉండేవారు. వారు డ్యాన్సులతో అలరిస్తుంటే మందుబాబులు పెగ్గు మీద పెగ్గు వేసి.. కావాల్సిన దానికన్నా ఎక్కువ బిల్లు చేసి కండ్లు తేలేసి వెళ్లిపోయేవారు. ఈ కల్చర్ను ప్రభుత్వాలు నిషేధించడంతో బార్లకు అప్డేట్వర్షన్గా వచ్చిన కొన్ని పబ్లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నాయి. పబ్లలో రూల్స్కు విరుద్ధంగా అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి న్యూడ్, సెమీ న్యూడ్గా డ్యాన్సులు చేయిస్తున్నాయి. అబ్బాయిలకు ఫ్రీ ఎంట్రీ అంటూ వారు వచ్చాక అందమైన అమ్మాయిలను వారితో కూర్చోబెట్టి మద్యం పోయించి వేలకు వేలు బిల్లు వేస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి చైతన్య పురి పోలీస్స్టేషన్పరిధిలోని పబ్లో వెలుగు చూసింది.
ఏం జరిగిందంటే..
చైతన్యపురి పోలీస్స్టేషన్పరిధి గ్రీన్ హిల్స్ కాలనీ లోని వైల్డ్ హార్ట్ పబ్ యజమాని రాము పబ్లోకి ఎవరికైనా ఫ్రీ ఎంట్రీ అంటూ ఆఫర్పెట్టాడు. తమ దగ్గర బ్యూటిఫుల్గర్ల్స్డ్యాన్సులతో అలరిస్తారని మౌత్పబ్లిసిటీ చేయడంతో రోజూ అబ్బాయిలు, అంకుల్స్అధిక సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. ముంబై, ఢిల్లీతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి అందమైన యువతులను ఎంగేజ్ చేసుకుని పబ్లో అపాయింట్చేసుకున్నాడు. ప్లాన్లో భాగంగా ఒకటి, రెండు పెగ్గులేసే వరకూ డ్యాన్సులు వేస్తూ దూరంగా రెచ్చగొట్టే గర్ల్స్.. తర్వాత మెల్ల మెల్లగా దగ్గరకు వస్తారు. తమకు కేటాయించిన టేబుల్దగ్గర ఉండే అబ్బాయి, అంకుల్పక్కన వెళ్లి కూర్చుంటారు. కవ్వించి.. మాటలతో మాయ చేసి బ్రాండ్లిక్కర్తెప్పిస్తారు. పీకల దాకా తాగిస్తారు. పెగ్గు పెగ్గుకో ఫుడ్ఐటమ్ఆర్డర్పెట్టి బిల్లు వంద రెట్లు అయ్యేలా శాయశక్తులా కృషి చేస్తారు. చివరకు బిల్లు కట్టే టైంలో అక్కడి నుంచి మాయమవుతారు.
ఎలా దొరికారంటే..
అబ్బాయిలు, అంకుల్స్కు పబ్కు వచ్చినప్పుడు ఉన్న సంతోషం.. వేలల్లో బిల్లు చూసేటప్పటికీ ఆవిరైపోయేది. దిక్కు లేని పరిస్థితుల్లో చాలా మంది వేసిన బిల్లు చచ్చినట్టు కట్టి బయటపడేవారు. ఈ విషయం అలా.. అలా ఎల్బీనగర్ఎస్ఓటీ పోలీసులకు చేరింది. కొందరు ఫిర్యాదు చేయకపోయినా తాము తాగకపోయినా, తినకపోయినా అమ్మాయిలు ‘మత్తు’లో పడి వేలల్లో బిల్లు కట్టామని వారి దృష్టికి తీసుకువెళ్లడంతో నిఘా పెట్టారు. పక్కాగా నిర్ధారించుకుని సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పబ్పై రైడ్చేశారు.
వెళ్లేటప్పటికీ కొంతమంది అమ్మాయిలు న్యూడ్, సెమీ న్యూడ్గా డ్యాన్సులు చేస్తూ కనిపించారు. మరికొందరు అదేపనిగా ప్రతి టేబుల్దగ్గర ఉండడంతో నిర్ఘాంతపోయారు. డ్రగ్ డిటెక్షన్ పరికరాలు, డాగ్ స్క్వాడ్ తో పబ్ లో తనిఖీ చేశారు. తమకు వచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకుని16 మంది యువతులను డీజే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని చైతన్య పురి పోలీసులకు అప్పగించారు. బార్ ఓనర్ రాము , మేనేజర్ సంతోశ్పై కేసు నమోదు చేశామని, వీరిద్దరూ పరారీలో ఉన్నారని చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.