జూన్​ 2న యాక్షన్ ప్లాన్‌ ప్రకటన..జేఏసీ చైర్మన్​ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​

జూన్​ 2న యాక్షన్ ప్లాన్‌ ప్రకటన..జేఏసీ చైర్మన్​ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ​సాధన కోసం జూన్​ 2న కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్​ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​ తెలిపారు. మంగళవారం పట్టణంలోని వాసవి గార్డెన్‌లో నిర్వహించిన అఖిలపక్ష, జేఏసీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.  చేర్యాల 60 ఏళ్ల కిందనే  నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీగా, వరంగల్​ జిల్లాలో పంచాయితీ సమితిగా, తాలూకా కేంద్రంగా, అసెంబ్లీ కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు.  అభివృద్ధిలో హుస్నాబాద్​, దుబ్బాక, గజ్వేల్​, ఆలేరు పట్టణాల కంటే ముందుండేదన్నారు. 

కానీ, పాలకుల నిరాదరణకు గురై  చిన్న మండలంగా మారిందని వాపోయారు. కనీసం రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరినా నేటి పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జూన్​ 2న అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు,  ఉద్యోగులతో మీటింగ్‌ పెట్టి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  నాయకులు ఆగంరెడ్డి,  మల్లారెడ్డి, ఆది శ్రీనివాస్​, అందె అశోక్​, అందె బీరయ్య, కొమ్ము నర్సింగరావు,  కళావతి,  యాదయ్య, బుట్టి సత్యనారాయణ, తడ్క లింగమూర్తి, ఈరి భూమయ్య,  ప్రశాంత్​,  రాజు, రాజిరెడ్డి, రాము, సుదర్శన్​, అరుణ్​ కుమార్​ 
పాల్గొన్నారు.