
న్యూఢిల్లీ: రైల్వే పోర్టర్ల హక్కుల కోసం పోరాడుతానని కాంగ్రెస్అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పోర్టర్లతో మాట్లాడిన వీడియోను రాహుల్ బుధవారం తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను ఎక్స్లోనూ పోస్ట్చేసి.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో ప్రజలకు సహాయం చేయడానికి పోర్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, అయినప్పటికీ వారి సమస్యలు ప్రభుత్వానికి కనిపించడంలేదని అన్నారు.
పోర్టర్ల హక్కుల కోసం తన శక్తి మేరకు పోరాడుతానని రాహుల్ పేర్కొన్నారు. అలాగే, జనసమూహాల వద్ద భద్రతను బలోపేతం చేయడానికి 'ఆవాజ్ భారత్ కీ' పోర్టల్పై సూచనలను చేయాలని ఆయన ప్రజలను కోరారు. "మేము భారతదేశం వాయిస్ను వింటాము!" అని ఆయన పోస్ట్లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో పెరుగుతున్న తొక్కిసలాటలు చాలా ఆందోళన కలిగించే విషయం అని, ఇలాంటి ఘటనలలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి విషాదాలను ఎలా నివారించాలో
మనమంతా ఆలోచించాలని ఆయన అన్నారు.