Jio: జియో నుంచి ఈ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది.. ఇంటర్నెట్ గట్టిగా వాడేవాళ్లకి గుడ్ న్యూసే..

Jio: జియో నుంచి ఈ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది.. ఇంటర్నెట్ గట్టిగా వాడేవాళ్లకి గుడ్ న్యూసే..

స్మార్ట్ఫోన్స్లో ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించే మొబైల్ యూజర్ల కోసం ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 198 రూపాయల డేటా ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 198 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందొచ్చు. 14 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్ అందుబాటులో ఉంది. ఇంటర్నెట్ను ఎక్కువగా వినియోగించే యూజర్లకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రీఛార్జ్ చేసుకునేందుకు ఫోన్ పే, గూగుల్ పే లాంటి పేమెంట్ యాప్స్ వాడటం కంటే మై జియో యాప్లో చేసుకుంటే ఎలాంటి అదనపు ఫీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఇటీవల ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచి యూజర్లకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. జియో, ఎయిర్ టెల్, వీఐ టెలికాం యూజర్లలో కొందరు ఈ పెంచిన ధరల భారాన్ని మోయలేక బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ పెట్టుకుని మారిపోయారు. రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ మెజారిటీ యూజర్లు ఇప్పటికీ సేమ్ టెలికాం నెట్ వర్క్స్లోనే కొనసాగుతున్నారు.

జియోకు పోటీగా ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్లో మార్పులుచేర్పులు చేస్తూ గట్టి కాంపిటీషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ యూజర్లు చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ గట్టిగానే  ట్రై చేస్తున్నాయి.