ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? రోడ్డుపై అందరూ చూస్తుండగానే..

ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? రోడ్డుపై అందరూ చూస్తుండగానే..

ఈరోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? ఇలా పంచాయితీలు పెట్టి తీర్పుల ఇచ్చి వారే శిక్షిస్తే కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు.. పచ్చిమ బెంగాల్ లో జరిగిన ఓ దారుణ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చుట్టూ జనం చూస్తుండగానే ఓ మహిళను కర్రతో కొట్టి, జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ.. కాలితో తన్నుతున్నాడు వ్యక్తి. మరో వ్యక్తిపై కూడా అక్కడున్న వారు దాడి చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ క్రమంలో ‘వీధి తీర్పు’పై నెటిజన్లు మండిపడుతున్నారు. వారు చేసింది ఎంత తప్పు అయినప్పటికీ అంత ఘోరంగా హింసిస్తారా అని ఫైర్ అవుతున్నారు. 

పశ్చిమ బెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ సంఘటన జరిగింది. కొంతమంది జనం గుంపుగా చూట్టూ చేరారు. జేసీబీగా పాపురల్‌ అయిన తాజెముల్ కర్రల కట్టతో మహిళను పదేపదే కొట్టాడు. దీంతో బాధతో ఆమె అరుస్తూ ఉంది. అయినా తాజెముల్ కొట్టడం ఆపలేదు. కింద కూర్చొన్న వ్యక్తిని కూడా అతడు కొట్టాడు. గుంపులోని వారంతా కళ్లప్పగించి దీనిని చూశారు. దాడిని ఆపడానికి ప్రయత్నించకపోగా కొట్టిన వ్యక్తికి అండగా నిలిచారు. మరో వ్యక్తి కూడా ఆ మహిళ జట్టుపట్టుకుని కాళ్లతో తన్నాడు. అయితే ఆ మహిళ, ఒక వ్యక్తిని బహిరంగంగా ఎందుకు కొట్టారో అన్నది తెలియలేదు. కానీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. పోలీసులు ఆ వ్యక్తిపై యాక్షన్ తీసుకోవాలని వీడియో చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.