నగల కోసం మహిళ దారుణ హత్య..

నగల కోసం మహిళ దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.. షాద్ నగర్ లో నగల కోసం ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని మూటలో కట్టిపడేశారు. శ్రీనివాస కాలనీలో చోటు చేసుకుంది ఈ దారుణం.మహిళ మృతదేహం ఒక మూటలో కట్టి పడేసి ఉండటం చూసిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మూటను తెరచి చూడగా మూటలోని మహిళ చెవ్వులు కత్తిరించబడి, చెవి కమ్మలు లేవని గుర్తించారు. అలాగే ఎక్కడో చంపి ఇక్కడ పడేసి వెళ్లిన ఆనవాళ్ళు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నారు.