50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..

50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..

తమిళనాడులో నిత్యా పెళ్లికూతురు బాగోతం వేలెడుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50పెళ్లిళ్లు చేసుకుంది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే, తమిళనాడు తిరుపూర్ కి చెందిన ఓ యువకుడు 35ఏళ్ళు వచ్చినా పెళ్లికాకపోవటంతో డేట్ ది తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.అయితే,పెళ్లైన 3నెలల తర్వాత సంధ్య ప్రవర్తనలో మార్పు రావటంతో అతను పోలీసులను ఆశ్రయించారు.దీంతో నిత్య పెళ్లికూతురు బండారం బయటపడింది.

పోలీసుల విచారణలో బయటపడ్డ సంధ్య లీలలు చూసి పోలీసులు సైతం విస్తుపోయే పరిస్థితి తలెత్తింది.ఈమె వలలో సామాన్య యువకులే కాకుండా ఒక డీఎస్పీ, ఇద్దరు పొలిసు అధికారులు కూడా ఉన్నట్లు తెలిసింది. నగలు, డబ్బే టార్గెట్ గా సంధ్య ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.