హెయిర్​ కలర్​ తాగి మహిళ సూసైడ్.. హైదరాబాద్ పేట్​బషీరాబాద్​ పరిధిలో ఘటన

హెయిర్​ కలర్​ తాగి మహిళ సూసైడ్.. హైదరాబాద్ పేట్​బషీరాబాద్​ పరిధిలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: అప్పులు కట్టలేక, ఇతరులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక పేట్​బషీరాబాద్​పరిధిలో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. వరంగల్​కు చెందిన శివరాత్రి దేవి (35)కి ముగ్గురు సంతానం. భర్త ఖాళీగా ఉంటుండగా, ఆమె బట్టల వ్యాపారం చేస్తున్నది. 

ఏడాది నుంచి వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని కట్టలేక, ఇతరులకు ఇచ్చిన డబ్బులు రాక దేవి కొద్దికాలంగా ఇబ్బందులు పడుతోంది. ఇదే విషయమై ఈ నెల5న కొంపల్లిలోని న్యూజివీడు సమీపంలో తన పుట్టింటికి వచ్చింది. జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్నహెయిర్​కలర్​తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 6న తెల్లవారుజామున మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో మరొకరు

సూరారంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరేసుకొని మృతి చెందాడు. దేవేందర్​నగర్​కి చెందిన శంకర్​ (29) ప్రైవేట్​ జాబ్​చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి పడుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు లేచేసరికి ఫ్యాన్​కు ఉరేసుకొని కన్పించాడు. ఈ విషయమై బంధువులు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.