ట్రీట్​మెంట్ పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతి

ట్రీట్​మెంట్ పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతి

నల్లబెల్లి, వెలుగు: పోలీసు స్టేషన్ క్వాటర్స్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ చికిత్సపొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్​పర్తికి చెందిన మహిళా కానిస్టేబుల్​జోరుక ధరణి(25) నల్లబెల్లి పీఎస్ లో విధులు నిర్వహిస్తుంది. సోమవారం స్టేషన్​హెడ్​ క్వాటర్స్ లో ప్రమాదశాత్తు జరిగిన విద్యుత్​షార్ట్ సర్క్యూట్ లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

చికిత్స కోసం నల్లబెల్లి పోలీసులు  వరంగల్​కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ ధరణి మంగళవారం సాయంత్రం చనిపోయింది. ఆమెకు పెండ్లి కాలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రశాంత్​బాబు చెప్పారు.