
జీడిమెట్ల, వెలుగు: పట్టపగలే దర్జాగా మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించిన మహిళ.. బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లింది. బాధితులు తేరుకొని పట్టుకునేలోగా అక్కడ్నుంచి ఉడాయించింది. సీఐ నర్సింహ వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టలోని అల్విన్కాలనీకి చెందిన సుదర్శన్వృద్ధుడు. తన ఇంటి పక్కన సివిల్వర్క్ జరుగుతుండగా, బుధవారం సాయంత్రం ఇంటి డోర్స్ఓపెన్చేసి, పని వారితో మాట్లాడుతున్నాడు. అతని భార్య ఇంటి వెనకాల పనిలో ఉంది.
ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని మహిళ ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో వెతుకుతుండగా, శబ్ధం విని సుదర్శన్వచ్చి చూశాడు. అప్పటికే మహిళ బీరువాలోని 7 తులాల బంగారం, 10 తులాల వెండిని తీసుకుని పారిపోతుండగా, అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, వృధాప్యం వల్ల ఆమెను నిలువరించలేకపోయాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి ముందు సదరు మహిళ ఓ ఫొటో షాప్లో ఫొటోలు దిగి, వాటిని డిలిట్ చేయించినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.
జీడిమెట్లలో తాళం వేసి ఉన్న ఇంట్లో..
జీడిమెట్లలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. అపురూపకాలనీకి చెందిన పింటూ హుడైట్బిజినెస్ చేస్తున్నాడు. ఈ నెల 5న కలకత్తాలో తమ బంధువుల వివాహం ఉండడంతో తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. రాత్రి దొంగలు పడి తన ఇంట్లో ఉన్న 20 తులాల బంగారు నగలు, అర కిలో వెండి, 15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.