
- ముఖం, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలు
- గాయాలు మానిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ
- ఎంఎంటీఎస్ బాధితురాలి ట్రీట్మెంట్పై డాక్టర్లు
- పరామర్శించిన మహిళా కమిషన్ కార్యదర్శి
- విధిలేక రైల్లోంచి దూకానన్న బాధితురాలు
పద్మారావునగర్, వెలుగు: ఎంఎంటీఎస్రైల్లో ఓ యువకుడు లైంగికదాడి చేయబోగా దూకి తీవ్రంగా గాయపడిన యువతికి అందిస్తున్న ట్రీట్మెంట్వివరాలను డాక్టర్లు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్చైర్ పర్సన్నేరెళ్ల శారద ఆదేశాల మేరకు కమిషన్కార్యదర్శి, సిబ్బంది మంగళవారం సికింద్రాబాద్ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు డాక్టర్లతో మాట్లాడారు.
ముఖం, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోని ఇతర భాగాల్లో చిన్న గాయాలు అయినట్లు తెలిపారు. ముఖం వాపు తగ్గిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసి గాయాలకు ట్రీట్మెంట్చేస్తామన్నారు. ప్రస్తుతానికి బాధితురాలు ఐసీయూలో ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఐసీయూలోకి వెళ్లిన కమిషన్కార్యదర్శి బాధితురాలితో మాట్లాడారు.
నిందితుడు లైంగిక దాడిచేయబోతున్నట్లు భావించానని, పోలీసులకు, ఫ్యామిలీ మెంబర్స్కు ఫోన్ చేద్దామనుకొన్నానని, కానీ, టైమ్లేకపోవడంతో రైలు నుంచి దూకి తప్పించుకోవాల్సి వచ్చిందని బోరుమంది. బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులకు కమిషన్అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని కమిషన్కార్యదర్శి ధైర్యం చెప్పారు.