![పిల్లలు పుట్టి నెల రోజుల్లోనే చనిపోతున్నారని.. మనోవేదనతో మహిళ ఆత్మహత్య](https://static.v6velugu.com/uploads/2025/02/women-died-in-petbasheerbad-at-hyderabad_8Y0pxtoCQz.jpg)
జీడిమెట్ల, వెలుగు: ఓ వైపు పిల్లలు పుట్టి నెలరోజుల్లోనే చనిపోతున్నారే బాధ.. మరోవైపు భర్త తాగుడుకు బానిసయ్యాడనే ఆవేదనతో ఓ మహిళ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది.
పేట్బషీరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. సుభాష్నగర్కు చెందిన కోదండ రామ్, దేవి (28)కి 2015లో పెండ్లి జరిగింది. 9 ఏండ్ల కాలంలో దేవికి రెండుసార్లు పిల్లలు పుట్టి నెలరోజుల వ్యవధిలోనే చనిపోయారు. దీంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ బాధను తట్టుకోలేక భర్త మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి దేవి తన ఇంట్లో ఉరేసుకొని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.