
కాశీబుగ్గ, వెలుగు: గ్రేటర్ వరంగల్ సంక్షేమంలో మహిళలలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొండా సురేఖ, సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. బల్దియా మేయర్ పీఠంలో కూడా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్గా మసూద్ రిజ్వానా షమీమ్ రాణిస్తున్నారు.మరోవైపు హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాలకు కలెక్టర్లుగా సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, ఇలా త్రిపాఠి పాలనాధికారాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ, సామాజిక, విద్య, వైద్య, పోలీసు, రంగాల్లో మహిళలు సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారనడానికి ఉమ్మడి జిల్లా ఉదాహరణగా నిలుస్తోంది.