
- మహిళలకు అవార్డుల ప్రదానం
- పోస్టర్ను ఆవిష్కరించిన సరోజ వివేక్
పంజాగుట్ట, వెలుగు:‘లవ్ ఫర్ కౌ’ ఫౌండేషన్ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని గుజరాతీ స్కూల్లో మార్చి 2న మహిళా దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీల కరస్పాండెంట్సరోజ వివేక్ గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవుల కోసం లవ్ఫర్ కౌ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. వారు నిర్వహించనున్న మహిళా దినోత్సవానికి మహిళలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ చైర్మన్జస్మత్పటేల్ మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ , సమాజంలో వారి వృత్తిని కొనసా గిస్తున్న మహిళలకు గోరత్న, మహిళా రత్న, వైద్య రత్న, సమాజ రత్న అవార్డులు ఇవ్వబోతున్నట్టు తెలిపారు.