జీడీకే 2వ గని వద్ద కార్మికుల నిరసన

జీడీకే 2వ గని వద్ద కార్మికుల నిరసన

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్​ పరిధిలోని జీడీకే 2వ గనిలో ప్రమాద ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గని అండర్​ మేనేజర్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని కార్మికులు సోమవారం నిరసనకు దిగారు. మొదటి షిప్టులో అటెండెన్స్​ పడిన తర్వాత విధులకు హాజరుకాకుండా గని ఆవరణలో బైఠాయించి నినాదాలు చేశారు. కార్మికులకు మద్దతుగా ఏఐటీయూసీ, ఐఎన్‌‌టీయూసీ, టీబీజీకేఎస్​, హెచ్ఎంఎస్​, బీఎంఎస్​, సీఐటీయూ సంఘాలకు చెందిన లీడర్లు నిలిచారు.

 పలువురు లీడర్లు మాట్లాడుతూ పనిస్థలం వద్ద ప్రమాదకరంగా ఉందని మైనింగ్​ సర్దార్​ చెప్పినా వినిపించుకోకుండా అండర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ భరత్‌‌ కార్మికులతో డ్యూటీ చేయించాడన్నారు. కాగా సింగరేణి ఆర్జీ 1 జీఎం శ్రీనివాస్​తో యూనియన్​ లీడర్లు చర్చలు జరిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. సింగరేణి డైరెక్టర్​ (ఆపరేషన్స్​, పా) ఎన్‌‌వీకే శ్రీనివాస్​ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఆయన వెంట రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం కే.హెచ్.ఎన్.గుప్తా, ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ బైద్య, మైన్​ సేఫ్టీ అధికారి దొంత వెంకటేశ్వర్లు 

ఉన్నారు.