మెదక్​ జిల్లాను చార్మినార్​జోన్​లో కలపాలె : ​శశికాంత్

మెదక్​ జిల్లాను  చార్మినార్​జోన్​లో కలపాలె : ​శశికాంత్

మెదక్ టౌన్, వెలుగు:  మెదక్​ జిల్లాను చార్మినార్​ జోన్​లో కలపాలని  లేదంటే రాబోయే రోజుల్లో తమకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్​సెక్రెటరీ శ్రీనివాస్​, వర్కింగ్​ ప్రెసిడెంట్​శశికాంత్​ డిమాండ్​చేశారు. 

 మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మెదక్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లను కలిసి చార్మినార్​లో మెదక్​ జిల్లాను కలపాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్, ప్రశాంత్, నాయకులు సాయి, సుధీర్ ​పాల్గొన్నారు.