
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఎలక్ట్రామా ఢిల్లీలో శనివారం ప్రారంభమైంది. ఇది ఈ నెల 26 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో జరుగుతుంది. దీనిని ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. కేంద్ర విద్యుత్, హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఎలక్ట్రికల్ షోను ప్రారంభించారు. ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆటోమేషన్, ఏఐ ఆధారిత పవర్ సిస్టమ్స్వంటి వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బీ2బీ మీటింగ్స్, లీడర్షిప్ సెషన్స్ జరుగుతాయి. మొదటిరోజు వెయ్యికిపైగా ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.